యూపీలోని మౌ జిల్లా సరైల్ఖాని ప్రాంతంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ, ఆమె కుమార్తె (16) చనిపోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సీసీటీవీ పరిశీలించగా, ఉద్దేశపూర్వకంగా కారు డ్రైవర్ ఢీకొట్టినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.