మరమ్మతులు చేస్తుండగా ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. శంఖవరం మండలం కత్తిపూడి శివారుకు మరమ్మతుల కోసం ఖాళీ ఆయిల్ ట్యాంకర్ను తీసుకొచ్చారు. దానిని వెల్డింగ్ చేస్తుండగా పేలింది. ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్ (38), బూరా సోమరాజు (39) మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వేడి తీవ్రతే దీనికి కారణమని అనుమానం వ్యక్తం చేశారు.