'పీఎం సూర్య ఘర్‌..' కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

1092చూసినవారు
'పీఎం సూర్య ఘర్‌..' కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల "పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన"ను ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్లతో అమలవుతున్న ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా సరఫరా చేయబడుతుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.78 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్