ఢిల్లీ-ఛత్తీస్గఢ్ రైలులో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బెర్త్ పై సీటులో ప్రయాణిస్తున్న ఆర్మీ మ్యాన్ మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. కింద సీటులో నిద్రిస్తున్న మహిళపై పడింది. ఆమె భర్త రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళ ఘటనపై ప్రధాని కార్యాలయానికి, రైల్వే మంత్రికి ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది.