రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత జానిక్ సిన్నర్

51చూసినవారు
రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత జానిక్ సిన్నర్
యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ స్టార్ ప్లేయర్ జానిక్ సిన్నర్ నిలిచారు. అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4, 7-5 ఆధిక్యంతో గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్నారు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ఇద్దరి మధ్య జరిగిన ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా రెండు గంటలకు పైగా జరిగింది. సిన్నర్ తన విజయంతో $3,600,000 డాలర్లు (₹30 కోట్ల కంటే ఎక్కువ) ప్రైజ్ మనీని అందుకున్నాడు.

సంబంధిత పోస్ట్