కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దోమకొండ మండలం అంబారీపేటలో తమ్ముడిపై అన్న, వదిన కత్తితో దాడి చేశారు. అన్నాదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడటంతో బార్బర్ షాపులోకి వెళ్లి తమ్ముడిపై అన్న, వదిన కత్తితో దాడి చేశారు. దీంతో బాధితుడు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.