చెట్టును ఢీకొన్న వ్యాన్.. నలుగురు విద్యార్థులు మృతి

54చూసినవారు
చెట్టును ఢీకొన్న వ్యాన్.. నలుగురు విద్యార్థులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కనీసం నలుగురు హైస్కూల్ విద్యార్థులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్రస్థాయి బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు బయలు దేరారు. జర్వాన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జైతీపూర్‌లోని లాటూరి సింగ్ ఇంటర్ కాలేజీకి పరీక్షల నిమిత్తం విద్యార్థులు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్