దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 72,818 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 22,131 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.89 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో టీసీఎస్, విప్రో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.