మాంసాహారం భోజనం ఖర్చు తగ్గి.. శాఖాహార భోజనం ఖర్చు పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ అధ్యయనం తెలిపింది. గతేడాదితో పోలిస్తే శాఖాహార భోజనం ఖర్చు 5 శాతం పెరిగితే.. మాంసాహారా భోజన ఖర్చు 13 శాతం తగ్గింది. బియ్యం, పప్పులు, టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు పెరగడంతో శాఖాహార భోజనం ధరలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.