గ్రూపు-4 ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తామని తెలిపింది. షెడ్యూల్ను కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టామని పేర్కొంది.