ఉత్తర్ప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ - కుర్తా, మెడలో రుద్రాక్షమాలతో అర్చకుల వస్త్రధారణలో సంప్రదాయబద్ధంగా విధుల్లో ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది.