తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం రైతు వేదికలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని రైతు వేదికల్లో (వీడియో కాన్ఫరెన్సింగ్) సేవలను 'రైతునేస్తం' పేరిట సీఎం రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉండగా 'రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ ఫామ్' ప్రాజెక్టు కింద ప్రారంభం చేయనున్నారు.