మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో భారీ చోరీ జరిగింది. ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊరు వెళ్లి తిరిగి వచ్చే సరికి దొంగలు తాళాలు పగులగొట్టి ఇంటి లోనికి చొరబడి బీరువాలో దాచిన రెండు తులాల బంగారు ఆభరణాలు, 46 వేల రూపాయల నగదును దోచేశారు.. ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.