పంట నష్ట పరిహారం అందించాలని వినతి

76చూసినవారు
పంట నష్ట పరిహారం అందించాలని వినతి
భారీ వర్షాలకు కొడంగల్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పత్తి, మినప పంటలు తీవ్ర నష్టానికి గుర య్యాయి. దీంతో రైతులు శుక్రవారం కొడంగల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ దేవేందర్ కు మాజీ సర్పంచ్ అనితా పకీరప్ప ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. వర్షాలకు పాడైన పంటలను పరిశీలించి పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్