వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట రాములు, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.