కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు

64చూసినవారు
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు
దోమ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో బుధవారం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్