రూ.100 కోట్లతో తాండూర్ అభివృద్ధి

60చూసినవారు
రూ.100 కోట్లతో తాండూర్ అభివృద్ధి
తాండూర్ నియోజకవర్గం అభివృద్ధికి రూ. 100కోట్లు మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పలు సమస్యలపై విన్నవించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించి త్వరలో రూ. 100కోట్ల నిధులు మంజూరు చేస్తానని అంగీకరించారని వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్