రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్, బిజెపి పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.