గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి పానీ పూరీలో కొత్త వెర్షన్ను కనుగొన్నారు. ఈ పానీ పూరీలో డ్రై మీవ్, తండై ఉన్నాయి. ఈ పానీ పూరీపై బంగారు, వెండి పూతతో అలంకరించిన తర్వాత బంగారు ప్లేట్లోనే వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఈ పానీపూరీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రియేటివిటీని కొందరు మెచ్చుకోగా మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.