రేషన్ కార్డు లేని రైతుల సర్వే జరుగుతుంది: డీఏఓ

61చూసినవారు
రేషన్ కార్డు లేని రైతుల సర్వే జరుగుతుంది: డీఏఓ
రుణమాఫీ పథకం అమలు కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో రైతులతో కలిసి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రేషన్ కార్డు లేని రైతులకు సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందన్నారు. ఈ నివేదిక తర్వాత రుణమాఫీ అమలవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్