ప్రధాని మోదీ హర్యానాలో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇటీవల కర్ణాటకలో గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఖైదీలను వ్యాన్ ఎక్కించినట్టు వినాయకుడిని పోలీసులు వ్యానులో ఎక్కించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘గణపతిని సైతం కటకాల వెనక్కి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటుచేసుకుంది’ అని మోదీ అన్నారు.