ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలు

73చూసినవారు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. శంషాబాద్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి సభను నిర్వహించారు. ఈ క్రమంలో సభకు వచ్చిన ప్రజలకు అక్కడి కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్