ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ సందడిగా మారింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.