తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం బడ్జెట్ పై వాడీవేడి చర్చ జరిగింది. మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,
కేటీఆర్, కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం రేవంత్ నిన్నటి సభలో
కేసీఆర్ మాట్లాడిన తీరును ఉద్దేశించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.