సీపీఐ మండల కౌన్సిల్ నిర్మాణ సభ

69చూసినవారు
సీపీఐ మండల కౌన్సిల్ నిర్మాణ సభ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మిని ఫంక్షన్ హాల్ లో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారథి అధ్యక్షతన గురువారం నిర్మాణ కౌన్సిల్ సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంభశివరావు, తక్కెళ్ళ పెళ్లి శ్రీనివాస్ లు హాజరు అయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం వారు మాట్లాడుతూ సీపీఐ చేసిన పోరాటాల వలనే పేదలకు ఇంటి స్థలాలు దక్కాయి అన్నారు. అలాగే సీపీఐకి అంతం లేదు అని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్