ఎస్సారెస్పీ జలాలను విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలి

1053చూసినవారు
బోర్లు, బావులలో నీరు అడుగంటి పోవడంతో రైతులు వేసిన వరి పొలాలు ఎండి పోతున్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ జలాలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కురవి శివారులో ఎండిపోయిన పంట పొలాలను సిపిఐ బృందం సభ్యులు సందర్శించారు. ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్టపరిహారం చెల్లించాలన్నారు.
.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్