బీరన్న బోనమెత్తిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం భీరన్న బోనాల సందర్భంగా సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బోనం ఎత్తుకొని సందడి చేశారు. గొల్ల కురుమల సంక్షేమానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో గొల్ల కురుమ కులస్థులు కాంగ్రెస్ కు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.