మైసంపల్లిలో దారుణ హత్య
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లిలో శనివారం జరిపోతుల రాజు అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం కుటుంబ సభ్యులు పరారయ్యారు. సంఘటన స్థలానికి దుగ్గొండి సిఐ శ్రీనివాస్, ఎస్సై పరమేష్ చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.