ఎండాకాలం ప్రారంభమైన సందర్భంగా ఇంటర్ విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు జనగాం జిల్లా ఇంటర్ మిడియట్ విద్యా శాఖ అధికారులు తెలిపారు. శనివారం వారు కార్యాలయంలో మాట్లాడుతూ జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు. మళ్లీ జూన్ 1వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు.