రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు

756చూసినవారు
రేవంత్ రెడ్డి పై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
మహబూబాబాద్ జిల్లాలో నిన్న జరిగిన హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపిసీసీ రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నెహ్రూ సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవంత్ రెడ్డి మీ. మాట విధానం మార్చుకోకుంటే మేము భౌతిక దాడులు చేయాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ మెన్ డా. రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎం డి ఫరీడ్, పట్టణ అధ్యక్షులు గద్దె రవి, పట్టణ యూత్ ప్రెసిడెంట్ యల్లా మురళీధర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ యూత్ నాయకులు మందుల రఘు, స్థానిక కౌన్సిలర్ లు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్