టీఎస్‌‌పీఎస్సీ వైఫల్యాలపై నిరసన

1761చూసినవారు
పరీక్షల నిర్వహణలో టీఎస్‌‌పీఎస్సీ వైఫల్యాలను నిరసిస్తూ మంగళవారం మహబూబాబాద్‌లో బీఎస్సీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ మాట్లాడుతూ... గత నాలుగు సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతన్న నిరుద్యోగులు, ఇలాంటి సమయంలో పేపర్ లీకేజీ అనేది తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సాధారణ విషయంగా చూడడం శోచనీయం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనె స్పందించి ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్