ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

28555చూసినవారు
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిర్రకుంట గ్రామపంచాయతీకి చెందిన సురేష్ (25) అనే యువకుడు ఆర్థిక ఇబ్బంది వలన ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చిరకుంట గ్రామానికి చెందిన గుగులోతు సురేష్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా చీరకుంట గ్రామంలో జీవనోపాధి లేక అప్పులు అధికం కావడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు పని చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల భారం కావడంతో మనస్థాపానికి గురై మంగళ‌వారం రాత్రి తన భార్య ప్రియాంక నిద్రిస్తున్న సమయంలో చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఒక 11 నెలల బాబు ఉన్నట్టుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్