విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి
నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామ శివారులో ఇటుక బట్టీలో వలస కాంతారావు, పోలమ్మ దంపతులు పని చేస్తున్నారు. శనివారం ఇటుక బట్టీలో కరెంటు రావడం లేదని ఫ్యూజ్ కరెంట్ వైర్ ని చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాంతారావుకు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.