జిల్లాలో నిఘా కట్టుదిట్టం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగియడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలో మూడు కోట్ల సెంటర్లో టౌన్ ఎస్సై అరుణ ఆధ్వర్యంలో వాహనా తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎన్నికల నియమావళి పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.