నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం పోలీస్టేషన్ పరిధిలో గల పందెం కొడిశలమిట్ట మొదలగు సమస్యాత్మకమైన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో శనివారం బాంబ్ స్క్వాడ్ బృందం విస్తృతంగా పర్యటించింది. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా అనుమానస్పద వ్యక్తులను, వాహనాలను, కల్వర్టులను క్షుణ్నంగా పరిశీలించింది. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.