ములుగు ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్

571చూసినవారు
ములుగు ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్
ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని భూపాలపల్లి, ములుగు జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రికి నార్కోటిక్ డ్రగ్ లైసెన్సు జారీకి గల వసతులను, ఫార్మసీ మెయిన్ స్టోర్, సబ్ స్టోర్, బ్లడ్ బ్యాంకుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. జగదీశ్వర్ తోపాటు వైద్యులు సిబ్బంది తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్