యుపిఎస్సి సిసాట్-2025 అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నామని ములుగు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు www. tmreistelangana. cgg. gov. in సైట్ ద్వారా ఈ నెల 22లోగా అప్లై చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 28 జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో జరుగుతుందని తెలిపారు.