ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో మహబూబాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మంగళవారం కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ. పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు.