బ్రిడ్జి క్రింద పైపులలోని చెత్తను తొలగించిన పోలీసులు

55చూసినవారు
బ్రిడ్జి క్రింద పైపులలోని చెత్తను తొలగించిన పోలీసులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎల్బాక నార్లాపూర్ చింతల్ క్రాస్ సమీపంలోని బ్రిడ్జిపై నుండి బుధవారం భారీ వరద ప్రవాహం వెళ్ళింది. దీంతో బ్రిడ్జి కింద పైపులలో చెత్తాచెదారంతో పైపులు మూసుకుపోవడంతో నీరు బ్రిడ్జిపై నుండి ప్రవహించింది. గురువారం తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్, కానిస్టేబుల్ సాంబయ్య జేసిబి సహాయంతో మట్టిని తొలగించారు.

సంబంధిత పోస్ట్