చెరువును తలపిస్తున్న గుర్రేవుల గ్రామంలోని రోడ్లు

66చూసినవారు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గుర్రేవుల గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లు వర్షానికి మునిగి చెరువును తలపిస్తున్నాయి. సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. స్థానికులు, వాహనదారులు రోడ్లపై నిలిచిన నీటితో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి, నీరు నిలువకుండా చూడాలని శుక్రవారం గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్