తాడ్వాయి: కొమురం భీం 84వ వర్ధంతి కరపత్రం ఆవిష్కరణ

58చూసినవారు
తాడ్వాయి: కొమురం భీం 84వ వర్ధంతి కరపత్రం ఆవిష్కరణ
ములుగు జిల్లా తాడ్వాయిలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈనెల 30న నిర్వహించనున్న కొమురం భీం వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి శనివారం కామారం (పిటి) గ్రామంలో కొమురం భీం 84వ వర్ధంతి కరపత్రాన్ని ఆవిష్కరించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, మండల అధ్యక్షుడు వెంకటేశ్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్