రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

2634చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానికులు ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్ దమ్మాయిగూడకు చెందిన శ్రీకాంత్, యువశ్రీ, శ్రావణిలుగా పోలీసులు గుర్తించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి కారులో వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్