ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియాతో గురువారం ఎంపీ కావ్య మాట్లాడుతూ. ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆలయాలు వరంగల్ లో ఉన్నాయని, వరంగల్ హెరిటేజ్ సిటీ అని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతో పాటు వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని అన్నారు.