మంగపేట మండలంలో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

53చూసినవారు
మంగపేట మండలంలో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
ములుగు జిల్లా మంగపేట మండలంలో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన కస్తూరి (26) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఎస్సై సూరి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్