నర్సంపేటలో ఘనంగా దసరా ఉత్సవాలు

61చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శనివారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంగడి మైదానంలో ఏర్పాటు చేసిన రావాణాసురుడి బొమ్మ వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రావణసురుడి బొమ్మ కు నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ నిప్పంటించి దగ్ధం చేశారు. దసరా వేడుకలకు పట్టణ ప్రజల భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్