వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అటవీ నిర్మూలన, విలువైన వనరుల విధ్వంసం జరుగకుండా అవగాహన కల్పించడమే ఈరోజు ప్రాముఖ్యత అని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.