వరంగల్: వామపక్ష సామాజిక ఐక్యతను బలోపేతం చేద్దాం

77చూసినవారు
వరంగల్: వామపక్ష సామాజిక ఐక్యతను బలోపేతం చేద్దాం
వామపక్ష సామాజిక ఉద్యమాలను బలోపేతం చేసే దిశలో కార్యకర్తలు కృషి చేయాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ కలకోట్ల యాదగిరి అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ఈనెల 17 నుండి 31 వరకు ఓంకార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్