నర్సంపేట: బుద్దాదిత్య మెహంతిపై చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
నర్సంపేట: బుద్దాదిత్య మెహంతిపై చర్యలు తీసుకోవాలి
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై హత్య బెదిరింపులు చేసిన బుద్దదిత్య మేహంతిపై ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు జయ్యారపు అఖిల్ సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం నేరం కింద అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు బేతి భరత్, పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్, వనపర్తి శోభన్ కుమార్, విజేందర్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్