నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో అద్దె బస్సుల యజమానులు బుధవారం వినతిపత్రాన్ని అందించారు. మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సుల్లో పరిమితికి మించి ప్రయనిస్తున్నారన్నారు. బస్సు టైర్లు, కట్టాలు విరిగిపోతున్నాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 5 నుండి సమ్మెలోకి వెళ్తామన్నారు. అద్దె బస్సుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తదితరులున్నారు.