ఈ నెల 13 వ తేదీ నుంచి 23 వతేదీ వరకు జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామ రామాలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతం లవకుశుల జన్మస్థలంతో పాటు వాల్మీకి మహర్షి తపమాచరించిన నేలగానూ ప్రసిద్ధి చెందిందన్నారు.